గుప్పుమనాలంటే.. జేబుకు చిల్లే!

గుప్పుమనాలంటే.. జేబుకు చిల్లే!


న్యూఢిల్లీ: సిగరెట్లపై విధించే సెస్‌ను పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పొగరాయుళ్ల జేబులు గుల్లకానున్నాయి. ఇప్పటికే జీఎస్టీ శ్లాబులో 28 శాతం పన్ను సిగరెట్లపై ఉండగా.. మరో 5 శాతం సెస్‌ను పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. దీంతో ప్రతి వెయ్యి సిగరెట్లకు అదనంగా రూ.485/- నుంచి రూ.792/-ల పన్ను భారం పెరగనుంది. సిగరెట్లపై అదనంగా సెస్‌ విధించడం ద్వారా కేంద్రానికి రూ.5 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top