‘టీ’లో విషం: నలుగురు దుర్మరణం
పాట్నా: బిహార్లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేస్తున్న ఓ బాలిక తెలిసీ తెలియక అందులో పురుగుల మందు కలపడంతో నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన దర్బాంగా జిల్లాలోని బహదూర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురువారం వెలుగుచూసింది. మృతుల్లో ముగ్గురు పురుషులు ఓ పదేళ్ల బాలిక ఉన్నారు.
డీఎస్పీ దిల్నవాజ్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. అర్చన అనే పదేళ్ల బాలిక కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేస్తూ పొరపాటున అందులో పురుగుల మందు కలిపింది. కుటుంబ సభ్యులందరు ఈ విషం కలిపిన టీ తాగడంతో నలుగురు మృతిచెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు దుఖాన్ మహ్తో(60), రామ్స్వరూప్ మహ్తో(65), అర్చన(10), ప్రకాశ్మెహ్తోలుగా గుర్తించారు. ప్రమీలాదేవి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.