నడిరోడ్డుపై ఐరన్ రాడ్డుతో యువతి హల్చల్
చంఢీగఢ్ : కారును ఢీకొట్టడమేకాకుండా ఇదేంటని ప్రశ్నించినందుకు నడిరోడ్డుపైనే ఇనుపరాడ్డుతో ఓ యువకుడిపై ఇష్టానుసారంగా దాడికి దిగింది ఓ యువతి. చంఢీగడ్లోని ట్రిబ్యూన్ చౌక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మెహాలీకి చెందిన శీతల్ శర్మ తన కారును వెనక్కు ర్యాష్గా తీస్తుండగా.. అదే సమయంలో వెనక వైపు ఉన్న చంఢీగఢ్కు చెందిన నితీష్ అనే 26 ఏళ్ల యువకుడి కారుకు తగిలింది. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది.
శీతల్ శర్మ తన కారులో ఉన్న ఐరన్ రాడ్డుతో నితీష్పై విచక్షణరహితంగా దాడికి పాల్పడింది. పోలీసులు శీతల్ శర్మను అరెస్ట్ చేశారు. నితీష్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజికమాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు