రద్దు ప్రభావం విడతలవారీగా ఉంటుంది: చిదంబరం
ముంబై: పెద్ద నోట్ల రద్దు ప్రభావం విడతలవారీగా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరం అన్నారు. ఇప్పుడు ప్రజలు పడుతున్న సమస్యలు, ఇబ్బందులన్నీ మొదటి విడతలోనివని అన్నారు. రెండో విడతలో దీని ప్రభావంతో అనేక రంగాలు ఇబ్బందులు పడతాయని జోస్యం చెప్పారు.
నోట్ల రద్దు ప్రభావం దీర్ఘకాలం ఉటుందని, ప్రభుత్వ సరైన రీతిలో ఆలోచించి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. నోట్ల రద్దుపై అసలు ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు నుంచి సలహాలు తీసుకున్నారో.. లేదో అని చిదంబరం సందేహం వ్యక్తం చేశారు.