ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం

Fire Breaks Out At  Battery Factory In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పీరాగర్హీలోని ఓ బ్యాటరీ ఫ్యాకర్టీలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీలు లీక్‌ అవ్వడంతో ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. పేలుడు దాటికి ఫ్యాక్టరీ గోడలు కూలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుంది. దాదాపు 35 ఫైర్‌ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తలిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top