ఇలా నదిలో పడేస్తారా?
యశవంతపుర: కరోనా రోగులకు చికిత్సలో వైద్యసిబ్బంది ధరించే పీపీఈ కిట్లు ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. ఉడుపి జిల్లా అలెవూరు గ్రామ పంచాయతి పరిధిలోని కోడంగళ నదిలో కిట్లు కనిపించడం ప్రజలను కలవరపెడుతోంది. పీపీఈ కిట్లను వాడిన తరువాత ఆస్పత్రిలోనే దహనం చేయడమో, లేక జాగ్రత్తగా పక్కనపెట్టడమో చేయాలి. ఎవరో దీనిని ఉపయోగించి నదిలో పారేసినట్లు కనపడుతోంది. దీనిపై స్థానిక ఆశా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణిపాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.(పేద బ్రాహ్మణునికి నిత్యావసరాల పంపిణీ)