'ప్రధానితో మాట్లాడిన తరువాతే నిర్ణయం'
ముంబై: కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించిన తర్వాతే నిర్ణయిస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. ప్రధాని అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తరువాత ఆయనతో మాట్లాడతామని చెప్పారు. అదే సమయంలో మహారాష్ట్రలో 15 ఏళ్ల అనుబంధానికి ఇటీవలే స్వస్తి చెప్పి, ప్రభుత్వానికి మద్దతు కూడా ఉపసంహరించుకున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)... ఆ పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్పైకి నెట్టే ప్రయత్నం చేసింది.
ప్రధాని మోదీతో చర్చించిన తర్వాత ఎన్డీఏలో కొనసాగాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించుకుంటే, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తామని బీజేపీ నేత సంబిత్ పాత్రా ప్రకటించారు.
**