ఓబీసీ ఆదాయ పరిమితి పెంపు

ఓబీసీ ఆదాయ పరిమితి పెంపు

సాక్షి,న్యూఢిల్లీ: ఓబీసీ కోటా పొందేందుకు క్రీమిలేయర్‌ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ 6లక్షల నుంచి రూ 8లక్షలకు పెంచారు. దీనిప్రకారం వరుసగా మూడేళ్ల పాటు రూ 8 లక్షలు అంతకుమించి వార్షికాదాయం ఉన్న తల్లితండ్రుల పిల్లలు క్రీమీలేయర్‌ కేటగిరీ పరిథిలోకి వస్తారు. ఇతర వెనుకబడిన తరగుతుల వారికి వర్తించే రిజర్వేషన్‌ ప్రయోజనాలు వీరికి వర్తించవు.

 

ఓబీసీల్లో క్రీమిలేయర్‌ పరిధిని నిర్ధారించేందుకు వార్షికాదాయ పరిమితిని రూ 6 లక్షల నుంచి రూ 8 లక్షలకు పెంచినట్టు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 1993లో రూ లక్షగా ఉన్న క్రీమిలేయర్‌ పరిమితిని 2004లో రూ 2.5 లక్షలకు, 2008లో రూ 4.5 లక్షలకు 2013లో రూ 6 లక్షలకు పెంచారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top