సుప్రీం కోర్టులో క‌రోనా క‌ల‌కలం

Coronavirus Outbreak: Supreme Court Staffer Tests Positive - Sakshi

న్యూఢిల్లీ: క‌రోనా సెగ భారత అత్యున్న‌త న్యాయ‌స్థానాన్ని తాకింది. సుప్రీం కోర్టులో ప‌నిచేసే రిజిస్ట్రార్‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ఆదివారం నిర్ధార‌ణ అయింది. ఏప్రిల్ 16న కోర్టుకు వ‌చ్చి విధులు నిర్వ‌హించిన ఆయ‌న త‌ర్వాత రెండు రోజులు జ్వ‌రంతో బాధ‌ప‌డ్డాడు. దీంతో అత‌నికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ అని తేలింది. దీంతో అత‌డిని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌రలించి చికిత్స అందిస్తున్నారు. అత‌నితో పాటు ప‌నిచేసిన ఇద్దరు రిజిస్ట్రార్ల‌ను క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు.‌ మ‌రోవైపు అధికారులు అత‌డు కోర్టు లోప‌ల, బ‌య‌ట ఎవ‌రెవ‌రిని క‌లిశార‌న్న దానిపై వివ‌రాలు సేక‌రిస్తున్నారు. అయితే కోర్టులు వీలైనంత‌వ‌ర‌కు అత్య‌వ‌స‌ర కేసుల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారానే విచార‌ణ చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. (లాక్‌డౌన్‌ ఉల్లంఘన : రంగంలోకి ఆర్మీ..)

(మమ్మల్ని నమ్మండి.. అన్నీ చేస్తాం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top