కరోనా: 24 గంటల్లో 601 కేసులు

CoronaVirus: Indian Government Releases Health Bulletin - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 601 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. అంతేకాకుండా కరోనా బారినపడి మరో 12 మంది మృతి చెందడంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 68కు చేరిందన్నారు. మర్కత్‌కు సంబంధించి ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో 1023 కేసులు నమోదైనట్లు లవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.  కరోనా కేసుల్లో 17శాతం మంది 60ఏళ్లు పైబడినవాళ్లే ఉన్నారని తెలిపారు. కరోనాపై ప్రజలు, రాష్ట్రాలు పాటించాల్సిన సూచనలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 11,32,734 కరోనా కేసులు నమోదు కాగా 60,355 మంది మృత్యువాతపడ్డారు.

చదవండి:
ఆ లైట్లు ఆర్పకండి: కేంద్రం క్లారిటీ

నోట్లతో ముక్కు తుడుచుకున్న వ్యక్తి అరెస్టు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top