కరోనా : 27 వేలకు చేరువలో కేసులు

Corona deaths Rises To 826 In India - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 26,917కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 5,914 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయినట్టు తెలిపింది. కరోనాతో గత 24 గంటల్లో 47 మంది మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 826కి చేరింది. కాగా, ప్రస్తుతం దేశంలో 20,177 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

మహారాష్ట్రలో అత్యధికంగా 7,628 కరోనా కేసులు నమోదు కాగా, 323 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 3,071, ఢిల్లీలో 2,625, మధ్యప్రదేశ్‌లో 2,096 రాజస్తాన్‌లో 2,083, తమిళనాడు 1,821, ఉత్తరప్రదేశ్‌లో 1,843 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top