పొలంలో రైతు మృతదేహం
లక్నో : యూపీలోని ప్రతాప్గఢ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బేలా రాంపూర్ గ్రామంలోని పొలంలో 35 ఏళ్ల దళిత రైతు మృతదేహం కాలిన స్ధితిలో బయటపడిందని సోమవారం పోలీసులు వెల్లడించారు. రైతు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
కాగా కేసులో ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు. వినయ్ సరోజ్ అనే రైతును దారుణంగా హత్య చేసిన దుండగులు ఆయన మృతదేహాన్ని దగ్ధం చేశారని అధికారులు తెలిపారు. కాగా హత్యకు ఎవరు పాల్పడిందీ, హత్యకు గల కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.