ఒక దేశం-ఒక నంబర్: బీఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ నేటి నుంచి ఉచిత రోమింగ్ సర్వీసులను ప్రారంభించనుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు పొందే ఇన్కమింగ్ కాల్స్పై ఎలాంటి రోమింగ్ చార్జీలు ఉండవు. తాము ప్రవేశపెట్టిన ఈ సరికొత్త పథకం వల్ల ‘ఒక దేశం-ఒక నంబర్’ అనే కల సాకరమైందని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనూపమ్ శ్రీవత్సవ అన్నారు. ఉచిత రోమింగ్ కాల్స్ పథకంపై ట్రాయ్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదని తెలిపారు. మార్చి చివరి నాటికి బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య 7.72 కోట్లుగా ఉంది.