ఆ బాలీవుడ్ నటికి బెయిల్
జైపూర్ : నెహ్రూ-గాంధీ కుటుంబంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోను పోస్ట్ చేసిన ఆరోపణలపై అరెస్టైన బాలీవుడ్ నటి పాయల్ రోహత్గీకి మంగళవారం అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ 25,000 విలువైన రెండు పూచీకత్తులపై సంతకం చేసిన అనంతరం ఆమెను కోర్టు బెయిల్పై విడుదల చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ యోగేష్ యాదవ్ వెల్లడించారు. దిగువ కోర్టు ఆమెకు ఎనిమిదిరోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపినా నటి న్యాయవాది భూపేంద్ర సక్సేనా తాజా బెయిల్ పిటిషన్ను జిల్లా కోర్టులో దాఖలు చేశారు. నెహ్రూ కుటుంబంపై అభ్యంతరకర పోస్ట్ చేసిన పాయల్ రోహత్గీపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసిన రాజస్ధాన్ పోలీసులు ఆదివారం గుజరాత్లోని అహ్మదాబాద్లోని తన నివాసం నుంచి ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పాయల్పై రాజస్ధాన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చర్మేష్ శర్మ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై చర్యలు తీసుకోవాలంటూ గాంధీ కుటుంబం నుంచి రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్పై ఒత్తిడి వచ్చిందని పాయల్ ఆరోపించారు.