గాంధీ ఫాదర్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ : కాషాయ నేతపై వేటు

BJP Suspends Anil Saumitra For Calling Mahatma Gandhi Father Of Pakistan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తుది విడత పోలింగ్‌కు ముందు బీజేపీకి సరికొత్త చికాకులు వచ్చిపడ్డాయి. గాడ్సేను కొనియాడుతూ సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ చేసిన వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన కాషాయపార్టీకి మరో నేత షాక్‌ ఇచ్చారు. మహాత్మ గాంధీని ఫాదర్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌గా బీజేపీ ప్రతినిధి అనిల్‌ సౌమిత్ర సోషల్‌ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌ చేశారు.

గాంధీ ఫాదర్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ అంటూ భారత్‌లో గాంధీ వంటి వారు కోట్ల మంది పుట్టినా వారిలో కొందరు దేశానికి ఉపయోగపడగా, మరికొందరు పనికిరానివారని ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో సౌమిత్ర పేర్కొన్నారు. కాగా సౌమిత్రను పార్టీ ప్రాధమిక సభ్యతం నుంచి తొలగిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. సౌమిత్ర తన వ్యాఖ్యలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బీజేపీ మధ్యప్రదేశ్‌ చీఫ్‌ రాకేష్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కాగా సౌమిత్ర బీజేపీ మీడియా వ్యవహారాల విభాగం బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top