రాందేవ్‌ బాబా సన్నిహితునికి అస్వస్థత

Baba Ramdev Close Aide Acharya Bal Krishna Taken To Hospital In Rishikesh - Sakshi

డెహ్రాడూన్‌: ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబాకు అత్యంత సన్నిహితులు, పతంజలి ఆయుర్వేద సంస్థ​ చైర్మన్‌ ఆచార్య బాలకృష్ణ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. పతంజలి యోగాపీఠం సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. తల తిరగడం, ఛాతిలో నొప్పి రావడంతో బాలకృష్ణను ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్‌ అత్యవసర విభాగపు వైద్యులు ఆయనకు ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారని సమాచారం. ఆచార్య బాలకృష్ణ నేపాల్ సంతతికి చెందిన భారతీయ బిలియనీర్.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top