నేడు తిరుమలకు ప్రధాని రాక

Arrival of The Prime Minister Narendra Modi To Tirumala Is On Today - Sakshi

స్వాగతం పలకనున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్, గవర్నర్‌ నరసింహన్‌

శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణం

పటిష్ట భద్రతా ఏర్పాట్లు 

తిరుమల : భారత ప్రధాని నరేంద్రమోదీ, ఉమ్మడి రాష్ట్రా ల గవర్నర్‌ నరసింహన్, ఆం ధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం శ్రీవారిని దర్శించు కోనున్నా రు. ఇందుకోసం ఏర్పాట్లను సమీక్షించిన టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవా లని అధికారులకు సూచించారు. ప్రధాని మోదీకి శ్రీవారి ఆలయం ఎదుట ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగ తం పలుకుతారు. టీటీడీ సంప్రదాయం ప్రకారం ఇక్తాఫర్‌ స్వాగతం పలికి మహాద్వారం ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఇదిలా వుంటే ప్రధానమంత్రిగా మోదీ 2015 అక్టోబర్‌ 3వతేదీ, 2017 జనవరి 3వతేదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో ఆయన మూడోసారి తిరుమల వస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్రమోదీ తిరుమల పర్యటన సందర్భంగా శనివారం ట్రయల్‌రన్‌ నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి పీఎం, సీఎం పర్యటించే మార్గాల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించి అణువనువుగా తనిఖీలు చేస్తూ భద్రత పటిష్ట పరిచారు.  

ప్రధాని పర్యటన వివరాలు: 
ll    ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 3 గంటలకు శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు.  
ll    4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 4.40 గంటలకు విమానాశ్రయం దగ్గరగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి చేరుకుంటారు. 
ll    5.10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 6 గంటలకు తిరుమల చేరుకుని దర్శనానికి వెళ్తారు
ll    శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 7.20 గంటలకు రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి 8.10 చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు. 
ముఖ్యమంత్రి పర్యటన ఇలా: 
ll    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 3.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 4.30 గంటలకు ప్రధానికి స్వాగతం పలికిన తర్వాత రోడ్డు మార్గా న తిరుమలకు వెళతారు. 
ll    దర్శనం అనంతరం తిరుమల నుంచి బయలు దేరి 8గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. 
ll    8.15 గంటలకు ప్రధానమంత్రికి వీడ్కోలు పలికిన తర్వాత 8.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు పయణమవుతారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top