క్యాంప్ నుంచి మెట్టినింటికి
తిరువనంతపురం: వరదలతో తీవ్ర విషాదంలో మునిగిన మలప్పురం జిల్లాలో ఓ యువతి పెళ్లి ఆమె కుటుంబ సభ్యులతోపాటు సహాయక శిబిరంలోని వారిలో ఆనందం నింపింది. అంజు అనే యువతికి షైజూ అనే వ్యక్తితో గతంలోనే పెళ్లి నిశ్చయమవ్వగా, వరదల వల్ల వారంతా సహాయక శిబిరానికి రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పెళ్లిని వాయిదా వేసుకోవాలని తొలుత భావించినా.. చివరకు అనుకున్న సమయానికే పెళ్లి జరిపించాలని వధూవరుల కుటుంబసభ్యులు నిర్ణయించారు. దీంతో ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా అంజు పెళ్లి దగ్గర్లోని ఓ గుడిలో జరిగింది.