భారత్లో ఆఫ్ఘన్ అధ్యక్షుడి పర్యటన
న్యూఢిల్లీ : ఒకరోజు పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ మంగళవారం ఉదయం భారత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్తో కూడా ఆయన భేటీ అయ్యారు. మరోవైపు హైదరాబాద్ హౌజ్కు చేరుకున్న ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపేతం అయ్యేలా ద్వైపాక్షిక సంబంధాలపై వీరు చర్చలు జరిపారు. ప్రధాని ఈ సందర్భంగా ఆఫ్ఘాన్ అధ్యక్షుడికి గౌరవ సూచకంగా విందు ఏర్పాటు చేయనున్నారు. అంతకు ముందు ఢిల్లీ విమానాశ్రయంలో ఆఫ్ఘన్ అధ్యక్షుడికి భారత అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
సంబంధిత వార్తలు