ఢిల్లీ సీఎం నిర్ణయంపై నటుడు విశాల్‌ హర్షం

Actor Vishal Praised Delhi CM Arvind Kejriwal - Sakshi

చెన్నై/ న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దక్షిణాది స్టార్‌ హీరో విశాల్‌ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ తీసుకున్న నిర్ణయం మా రాష్ట్రం (తమిళనాడు)లోనూ అమలు చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీకి చెందిన 400 మంది టీచర్లను సింగపూర్‌కు చెందిన నేషనల్‌ ఇనిస్టిస్ట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌కు శిక్షణ నిమిత్తం పంపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గతేడాది 200 మంది టీచర్లను ప్రపంచంలోని అత్యుత్తమ టీచింగ్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిస్ట్యూట్‌లో శిక్షణ ఇప్పించామని ఆప్‌ నేత, డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా చేసిన ట్వీట్‌కు నటుడు విశాల్‌ రీట్వీట్‌ చేశారు.

‘ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తెలియగానే సంతోషించా. ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుని గొప్ప ప్రారంభానిచ్చారు. కేజ్రీవాల్‌ సార్‌కి ఆల్‌ ది బెస్ట్‌. మా రాష్ట్రం (తమిళనాడు)లోనూ ఇలాంటివి అమలు కావాలని ఆశిస్తున్నా. మెరుగైన విద్యా వ్యవస్థకు ఇలాంటివి చాలా అవసరమని’ విశాల్‌ తన ట్వీట్లో పేర్కొన్నారు. 

దేశ భవిష్యత్తు టీచర్లపై ఆధారపడి ఉంటుందని కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు. ‘మన పిల్లలను దారిలోకి తెచ్చి సన్మార్గంలో నడిపించేది గురువులే. ఢిల్లీ ప్రభుత్వం తమ టీచర్లకు అత్యుత్తమ శిక్షణ ఇప్పించాలని భావిస్తోందని’ కేజ్రీవాల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top