బెంగాల్లో మానవమృగం దారుణం
పురూలియా: పశ్చిమబెంగాల్లో దారుణం చోటు చేసుకుంది. పురూలియా జిల్లా నడియారా గ్రామంలో అభంశుభం తెలియని చిన్నారిపట్ల ఓ వ్యక్తి పైశాచికత్వం ప్రవర్తించాడు. సనాతన్ గోస్వామి అనే వ్యక్తి ఇంట్లో ఓ మహిళ పనిచేస్తుంటుంది. ఆమెకు మూడేళ్ల కూతురు ఉంది. తల్లి పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో సనాతన్ గోస్వామి చిన్నారిని బయటకు తీసుకెళ్లాడు.
పాపను లైంగికంగా వేధించటంతోపాటు సూదులతో గుచ్చి దారుణంగా హింసించాడు. చిన్నారి తీవ్రంగా రోదిస్తుండటంతో ఆమె తల్లి పరిశీలించి చూడగా శరీరంపై గాయాలు కనిపించాయి. దీనిపై ప్రశ్నించగా సనాతన్ గోస్వామి నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. దీంతో ఆమె స్థానికుల సాయంతో బంకూర మెడికల్ కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న గోస్వామి కోసం గాలింపు చేపట్టారు.