ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని లాతూర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, జీపు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు చనిపోయారు. క్రీడా అవసరాల కోసం ఉపయోగించే వాహనం(కారు) పంధర్పూర్ నుంచి నాందేడ్ వైపు వస్తుండగా ఎదరుగా వస్తున్న జీపును ఢీకొంది. ఓ టెంపోను ఓవర్టేక్ చేసే క్రమంలో కారు అదుపుతప్పి జీపును ఢీకొందని ఇన్స్పెక్టర్ గజానన్ భతల్వాండే తెలిపారు.
ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారని, 14 మందికి గాయాలయ్యాయని చెప్పారు. మృతులను తుకారం దాల్వి(34), మనోజ్ షిండే(25), శుభాన్ షిండే(23), దత్తు షిండే(34), విజయ్ పాండే(30), ఉమాకాంత్ కరులె(45), మీనా ఉమాకాంత్ కరులె(39)గా గుర్తించారు. అయితే కారు, జీపులో ఎంతమంది ప్రయాణించారనే వివరాలు తెలియరాలేదు. క్షతగాత్రులను లాతూర్ ఆస్పత్రికి తరలించారు.