మైనర్‌ను రేప్‌ చేసి, సజీవ దహనం.. 14 మంది అరెస్ట్‌

16 Years Old Girl Molestation And Burnt In Jharkhand - Sakshi

ఛాత్రా (జార్ఖండ్‌) : ఒకదాన్ని మించి మరో ఘోరం, దేశవ్యాప్తంగా ఆగని అత్యాచారాలు.. తాజాగా జార్ఖండ్‌ రాష్ట్రం ఛాత్రా జిల్లాలోని రాజా కెందువా గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికను రేప్‌ చేసి ఆపై ఆమెను బతికుండగానే నిప్పంటించి హతమార్చారు. అయితే ఈ సంఘటనలో నిందితులైన 18 మందిలో 14 మందిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అసలేం జరిగిందంటే.. బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరైన బాలికపై శుక్రవారం మధ్యాహ్నం ధను భుయియన్‌ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి తండ్రి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయగా.. వారు పంచాయితీ నిర్వహించి నిందితుడికి రూ.50 వేల జరిమానా విధించారు.

దీంతో బాధిత కుటుంబంపై ఆగ్రహించిన నిందితుడు ధను, అతని అనుచరులు బాధిత కుటుంబంపై దాడి చేశారు. అత్యాచారానికి గురైన బాలికను సజీవ దహనం చేశారు. పోలీసులు ధను, అతని అనుచరులు, పంచాయితీ నిర్వహించిన పెద్దలపై కేసులు నమోదు చేశారు. మొత్తం 18 మందికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు తేల్చి వారిలో 14 మందిని శనివారం అరెస్టు చేశారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు. గ్యాంగ్‌ రేప్‌ చేసినందకు వీరిని అరెస్టు చేసిన బాలిక పోస్ట్‌ మార్టమ్‌ రిపోర్ట్స్‌ వచ్చిన తర్వాత తగు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కెందువా గ్రామంలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top