ఆ రాత్రి ఏం జరిగింది?
ప్రస్తుతం బాలీవుడ్లో అందరి నోళ్లల్లో ఎక్కువ నానుతున్నది ఒకే ఒక్క వార్త. ‘ఆ రోజు రాత్రి ఏం జరిగింది’ అన్నదే ఆ వార్త. ఆ రాత్రి గడిచి దాదాపు అయిదు రోజులవుతున్నా కూడా హాట్ టాపిక్గానే మిగిలిపోయింది. గత నెల 28న చాక్లెట్బోయ్ రణబీర్కపూర్ పుట్టినరోజు. మామూలుగా పుట్టినరోజంటే చాలామంది ప్రత్యేకంగా జరుపుకుంటారు.
ఇక, ప్రేయసి ఉన్నవాళ్లయితే ఆ రోజంతా తనతోనే స్పెండ్ చేయాలని కోరుకుంటారు. రణబీర్ కూడా అలానే అనుకున్నారు. లక్కీగా తన పేరంట్స్ కూడా ఏదో పని మీద సిటీలో లేకపోవడంతో కలిసొచ్చింది. ఎంచక్కా కత్రినాని కృష్ణ రాజ్ (రణబీర్ ఇంటిపేరు)కి ఆహ్వానించారు. ఆ రోజు పగలంతా ‘బేషరమ్’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న రణబీర్, ఆ రాత్రికి బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు.
ఒక్క కత్రినా కైఫ్... వంద మంది అతిథులతో సమానం అనుకుని ఉంటారు రణబీర్. అందుకే సెలబ్రేషన్స్కి ఎవర్నీ ఆహ్వానించలేదు. కృష్ణ రాజ్ సాక్షిగా ప్రేయసితో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారాయన. కాకపోతే... రాత్రి మొత్తం సెలబ్రేషనా? అసలా రాత్రి సెలబ్రేషన్స్లో భాగంగా ఏం జరిగి ఉంటుంది? అని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. కొసమెరుపు ఏంటంటే.. మర్నాడు తెల్లవారుజామున రణబీర్ ఇంటి నుంచి కత్రినా బయటికొస్తూ.. చాలామంది కళ్లల్లో పడ్డారు. ఫలితంగా గాసిప్పురాయుళ్ల నోటికి మంచి మేత ఇచ్చారు.