మళ్లీ అశ్చర్యపరుస్తారట

Vijay Sethupathi, Kajal Aggarwal in Awe sequel - Sakshi

ఆశ్చర్య కదా.. ‘అశ్చర్య’ అని ఉందేంటి అనుకుంటున్నారా? అయితే చదవండి. గత ఏడాది ‘అ!’తో అందర్నీ ఆశ్చర్యపరిచారు ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడు ఇంకోసారి అశ్చర్యపరచడానికి ప్రశాంత్‌ వర్మ సిద్ధమయ్యారని తెలిసింది. నాని నిర్మాణంలో కాజల్‌ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అ!’. ఈ సినిమాకు సీక్వెల్‌ ప్లాన్‌ చేశారు ప్రశాంత్‌ వర్మ. స్క్రిప్ట్‌ పనులు కూడా పూర్తయ్యాయని తెలిసింది. ఇందులో కాజల్, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా నటీనటుల గురించి ఏమీ అనుకోలేదని యూనిట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top