తర్వాత ఏం జరుగుతుంది
మాల్యాద్రి మామిడి (ప్రదీప్)ని దర్శకునిగా పరిచయం చేస్తూ మరిడి శ్రీనివాస్ ఓ సినిమా రూపొందించనున్నారు. వజ్ర శ్రీ ఫిలిమ్స్, జి.బి. మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్.1గా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది. నిర్మాత మరిడి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘నేను గతంలో సినిమా రచయితగా అవకాశాల కోసం ప్రయత్నించినా కుదరలేదు. తర్వాత వ్యాపారం మొదలెట్టాను. సినిమా మీద ప్యాషన్తో నిర్మాతగా ఈ సినిమా ఆరంభించాను.
మాల్యాద్రి చెప్పిన కథ బాగా నచ్చింది. స్టోరీ వింటున్నంత సేపు తర్వాత ఏం జరగబోతుంది? అనే ఆసక్తి కలిగింది. ఈ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘ఒక సినిమాలో హీరోగా నటించిన నటుడు మా చిత్రంలో హీరోగా నటించనున్నారు. ప్రస్తుతం కథానుగుణంగా ఆయన ఫిజిక్ వర్కవుట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్లో పేరు అనౌన్స్ చేద్దామని ఇప్పుడు ప్రకటించడం లేదు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ హిందీ హీరోయిన్ని పరిచయం చేస్తున్నాం’’ అన్నారు మాల్యాద్రి.