జక్కన్న మల్టీ స్టారర్‌పై మరో అప్‌డేట్‌

Ram Charan Rajamouli Ntr - Sakshi

బాహుబలి సీరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ ను ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్న జక్కన్న టీం నుంచి మాత్రం ఇంత వరకు ప్రకటన రాలేదు. అయితే ఫిలిం నగర్‌ లో మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అప్‌ డేట్స్‌ తెగ హల్ చల్‌ చేస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్, త్వరలో బోయపాటి సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. తారక్‌ కూడా త్రివిక్రమ్‌ సినిమాను స్టార్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు. వీరిద్దరు ఈ ప్రాజెక్ట్స్‌ పూర్తయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్‌ కు డేట్స్  ఇవ్వనున్నారట. అక్టోబర్‌ నుంచి ఈ భారీ మల్టీ స్టారర్‌ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top