యూత్‌కు కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది

Shukra Productions New Movie On Final Schedule - Sakshi

దర్శకుడు వీఎస్‌ ఫణీంద్ర

పిబ్రవరి 4నుంచి ఫైనల్ షెడ్యూల్లో శుక్రా  ప్రొడక్షన్ మూవీ

కొత్తతరం ఆలోచనలకు దగ్గరగా ఉండే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడతాయి అని చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి సబ్జెక్ట్ తో శుక్రా  ప్రొడక్షన్ బ్యానర్ లో  మిషాన్ జైన్,  హేమలతా రెడ్డి హీరో , హీరోయిన్లు గా రాబోతున్న చిత్రం టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసుకొని పాటలో చిత్రీకరణ కు సిద్దం అవుతుంది. కంటెంట్ ని బేసెడ్ సినిమాగా ఇండస్ట్రీ లో బజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా టైటిల్ ని త్వరలోనే ప్రకటిస్తామని ప్రొడ్యూసర్ సంజయ్ జాదవ్ తెలియజేశారు. 

ఈ సందర్బంగా దర్శకుడు వి ఎస్ ఫణీంద్ర మాట్లాడుతూ.. ‘యూత్‌కి రిలేట్ అయ్యే అంశాలతో సినిమా రూపొందుతుంది.  అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకుంటాయి.  సినిమా తప్పకుండా మంచి విజయం సాధింస్తుందనే నమ్మకం మా టీం కు ఉంది. హీరో, హీరోయిన్ల పాత్రలు చాలా బోల్డ్ గా ఉంటాయి. రాజా రవీంద్ర ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు.  సినిమా పిబ్రవరి 4నుంచి ఫైనల్ షెడ్యూల్ కి వెళుతుంది. సినిమా తప్పకుండా ఒక టాక్ ని క్రియేట్ చేస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది’. అని ఫణీంద్ర అన్నారు. ఇక ఈ చిత్రానికి హర్ష ప్రవీణ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top