ఆమెను కేవలం పాటలు, డ్యాన్స్ కోసం తీసుకోలేదు!
సాక్షి, న్యూఢిల్లీ: 'బాహుబలి' సినిమాల తర్వాత టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన అనంతరం ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో 'సాహో'పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. ఈ సినిమా గురించి నటుడు ప్రభాస్ పీటీఐతో మాట్లాడుతూ.. శ్రద్ధా పాత్ర మూవీలో చాలా కీలకం కానుంది. ఆమెను కేవలం పాటలు, డ్యాన్స్ కోసం మాత్రం తీసుకోలేదు. గతంలో ఏ బాలీవుడ్ నటితో మూవీ చేయలేదు. కానీ సోహోకు శ్రధ్దాను తీసుకోవడం బెస్ట్ చాయిస్.
సినిమాలో శ్రద్ధా చేసే యాక్షన్ సీన్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. సాహో సినిమాలో శ్రద్ధాకపూర్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మూవీ కోసం ఆమె చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆమె నటన, సినిమాలపై ఉన్న ఆసక్తికి ఇంప్రెస్ అయ్యాను. గతంలో నాతో పాటు నటించిన హీరోయిన్లలో కొందరు ముందు టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఆపై బాలీవుడ్ వెళ్లారు. కానీ శ్రద్ధా మాత్రం బాలీవుడ్లో ప్రూవ్ చేసుకున్న తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేయడం సంతోషంగా ఉందన్నారు’ రెబల్ స్టార్ ప్రభాస్.
మరోవైపు 'సాహో' సినిమా వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలని చిత్రనిర్మాతలు భావిస్తున్నారు. దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రయూనిట్ శ్రమిస్తోందని, అయితే, వీఎఫ్ఎక్స్ మిక్సింగ్ కోసం కొంచెం ఎక్కువ సమయం పడితే.. 2019లో ఈ సినిమా విడుదల అవుతుందని సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వస్తున్న ఈ సినిమాలో ట్రాన్స్ఫార్మర్ వంటి హాలీవుడ్ సినిమాలుకు పనిచేసిన కేన్నీ బేట్స్ నేతృత్వంలో కళ్లుచెదిరేరీతిలో స్టంట్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.