హీరో అందుకే నోరు తెరవలేదు: నటి

హీరో అందుకే నోరు తెరవలేదు: నటి


ముంబై: సోషల్ మీడియాలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉంటున్న సెలబ్రిటీలలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఒకరు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన కత్రినా.. రికార్డుస్థాయిలో ఒక్కరోజులోనే సుమారు 9లక్షల మంది ఫాలోవర్స్‌ను సొం‍తం​ చేసుకుంది. దీంతో ఆమె తన వివరాలు, ఫొటోలను తరచుగా ఫాలోయర్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పాలి. సోషల్ మీడియా అంటే ఒకప్పుడు తనకు ఎంతో భయంగా ఉండేదని, ఆ కారణం వల్లనే తాను ఇంటర్‌నెట్ తక్కువగా వాడేదాన్నని చెప్పిన సందర్భాలున్నాయి.



ఆ అపోహలు ప్రస్తుతం తొలగిపోయాయని చెబుతోంది కత్రినా. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. 'గతంలో సోషల్ మీడియాపై ఎన్నో భయాలుండేవి. అనవసరంగా ఆందోళన చెందాను. ఇప్పుడు నాకు ఎలాంటి భయాలు లేదు. ఫాలోయర్స్‌తో హాయిగా కలిసిపోతున్నాను. నా అప్‌డేట్స్ కోసం వారు ఎదురుచూస్తుంటారని నేను ఇన్ని రోజులు గుర్తించలేకపోయాను. వ్యక్తిగత జీవితం, మనతో ఉండేవాళ్లతో ముడిపడే జీవితం అని రెండు ఉంటాయి. వ్యక్తిగత జీవితంతో ఎంతో తృప్తిగా ఉన్నాను.



దేశానికి సంబంధించిన అంశంపై మాట్లాడేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ నిరాకరించడంపై ఓ విషయం చెబుతాను. సెలబ్రిటీలకూ ప్రతి అంశంపై ఓ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ ఆ హీరో మీడియా ప్రశ్నకు ఆయన తన అభిప్రాయం చెబితే.. అదో పెద్ద తప్పిదంగా చిత్రీకరించే అవకాశం ఉంది. అందుకే సుశాంత్ ఆ విషయాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. నోరు మెదపడానికి నిరాకరించి ఉండొచ్చు. అంతెందుకు నేను ఏదైనా చెబితే ఎవరు వింటారు. నీకు ఏం హక్కు ఉందని అలాంటి విషయంపై స్పందిస్తావు' అంటూ విమర్శిస్తారని కత్రినా తన మనసులో మాటను చెప్పుకొచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top