ప్రముఖ నిర్మాత గుండెపోటుతో మృతి
ప్రముఖ నటుడు మోహన్ బాబు చెల్లెలి భర్త, నిర్మాత అయిన మేడసాని వెంకటాద్రి నాయుడు(55) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన మరణించారు. మోహన్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన వెంకటాద్రి నాయుడు, ప్రస్తుతం మోహన్ బాబు స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు కోశాధికారిగా ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు నారావారిపల్లిలో ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు జరగనున్నాయి.