రాజమౌళి మల్టీస్టారర్‌పై మరో అప్‌డేట్‌

Sai Madhav Burra Working For Rajamouli RRR - Sakshi

బాహుబలి లాంటి భారీ విజయం తరువాత లాంగ్‌ గ్యాప్ తీసుకున్న దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తన తదుపరి చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్‌ల నిర్మాణం కూడా జరుగుతోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా అన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ సినిమాకు మాటల రచయితగా కవితాత్మక సంభాషణలు రాసే సాయిమాధవ్‌ బుర్రాను తీసుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ టీం నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top