అంతా ఓకే

Saaho to go Mission Impossible, Fast Five way - Sakshi

కార్లు.. బస్సులు కదిలి వచ్చె

అనుమతి లభించింది. ఇక యాక్షన్‌లోకి ఎంటరవ్వడమే ఖాయం. యస్‌.. దుబాయ్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తీయడానికి ‘సాహో’ టీమ్‌కి అనుమతి లభించింది. దాదాపు రెండు రోజుల క్రితం ఈ చిత్రబృందం దుబాయ్‌ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ చిత్రీకరణకు అనుమతి లభించడంతో చిత్రదర్శకుడు సుజీత్‌ దుబాయ్‌లో బెస్ట్‌ లొకేషన్స్‌ని సెలెక్ట్‌ చేస్తున్నారు. ఈ నెల 10న షూట్‌ మొదలవుతుందట. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌ జంటగా యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుబాయ్‌లో చిత్రీకరించనున్న యాక్షన్‌ ఎపిసోడ్‌ విషయానికొస్తే.. హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ ఆధ్వర్యంలో ఈ ఫైట్‌ చిత్రీకరణ జరగనుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇండియన్‌ స్క్రీన్‌ మీద అత్యంత ఖరీదైన యాక్షన్‌ సీక్వెన్స్‌ ఇదేనట. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం యూఎస్, జర్మనీల నుంచి ఖరీదు గల కార్లు, బస్సులను తెప్పించారట. దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దుబాయ్‌లో ప్లాన్‌ చేసిన ఈ ఒక్క ఫైట్‌కే 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌కి సంబంధించిన ప్రోమోను త్వరలో విడుదల చేయడానికి యూనిట్‌ సన్నాహాలు చేస్తోందట. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top