రవితేజ... రానా... ఓ రీమేక్!
మలయాళ సూపర్హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగులో రీమేక్ కానుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు దక్కించుకున్నారని సమాచారం. మలయాళంలో సాచీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ పోటాపోటీగా నటించారు. ఈ సినిమా తెలుగు రీమేక్లో నటించే హీరోలు ఫైనలైజ్ అయ్యారట. ఇందులో రవితేజ, రానా నటించబోతున్నారని ఫిల్మ్నగర్ లేటెస్ట్ టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం దక్కించుకున్న సంగతి తెలిసిందే.