లాక్ చేశారు
స్పీడ్ గేర్లో దూసుకెళుతున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా షూటింగ్తో బిజీ అయిపోతారు. ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ను అల్లు అర్జున్కు వినిపించేశారు సుకుమార్. కథ విని, బన్నీ ఫుల్ ఖుష్ అయ్యారని సమాచారం. హీరోకి నచ్చాక ఇక స్క్రిప్ట్ లాక్ చేసేస్తారు కదా. ఇక మంచి ముహూర్తం చూసుకుని సినిమాని ప్రారంభించడానికి వెయిటింగ్. షూటింగ్ను సెప్టెంబర్లో ఆరంభించాలనుకుంటున్నారట.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తారు. ఒకవైపు సుకుమార్ సినిమా చేస్తూనే మరోవైపు వేణుశ్రీరామ్ దర్శకత్వంలో అంగీకరించిన ‘ఐకాన్’ సినిమా షూటింగ్లోనూ అల్లు అర్జున్ పాల్గొంటారట. ఈ సంగతి ఇలా ఉంచితే...ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కాకినాడ షెడ్యూల్లో పాల్గొంటున్నారు అల్లు అర్జున్.