చలో కశ్మీర్‌

Rashmika Mandanna roped in for Mahesh Babu film with Anil Ravipudi - Sakshi

ప్రస్తుతం హాలిడేని ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు మహేశ్‌బాబు. త్వరలోనే ఆయన కశ్మీర్‌కు వెళ్లనున్నారని తెలిసింది. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే సినిమా తెరకెక్కనున్న  సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తారు. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించనున్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్‌బాబు ఆర్మీ మేజర్‌గా నటించనున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను చిత్రబృందం కశ్మీర్‌లో ప్లాన్‌ చేస్తోందని తెలిసింది. హీరో హీరోయిన్లపై అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. మరి... కశ్మీర్‌లో మహేశ్‌ ప్రేమ కహానీ ఏంటో వెండితెరపై చూడాల్సిందే. కర్నూల్‌లోనూ ఓ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారట టీమ్‌.  విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌ కీలకపాత్రలు చేయనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిచనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top