అలియాతో పెళ్లిపై రణ్బీర్ కామెంట్
బాలీవుడ్ లవర్ బాయ్ రణ్బీర్ కపూర్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. సంజు మూవీ హిట్తో ఇటు ప్రొపెషనల్ లైఫ్లో, కో స్టార్ అలియా భట్తో ఏర్పడిన ప్రేమ బంధంతో అటు పర్సనల్ లైఫ్లోనూ సంతోషంగా గడుపుతున్నారు. అలియా భట్తో డేటింగ్లో ఉన్న విషయాన్ని కూడా రణబీర్ ఇటీవల ఒప్పేసుకున్నారు. దీంతో ఈ జంటపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
అలియా, రణబీర్ త్వరలో పెళ్లి చేసుకుంటారని, కాదు అల్రెడీ వీరి మ్యారేజ్ జరిగిపోయిందని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ రణబీర్ మాత్రం వీటిన కొట్టిపడేశాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచననే లేదని తేల్చి చెప్పాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం నేను హ్యాపీగా ఉన్నాను. లైఫ్ ఆనందంగా గడుస్తోంది. కానీ కొంత మంది నా వ్యక్తిగత జీవితంపై ఏవేవో పుకార్లు సృష్టిస్తున్నారు. వారి వ్యాపారం కోసం మా పర్సనల్ లైఫ్ని బయటకు ఈడ్చుతున్నారు. ఎవరి వ్యక్తిగత విషయాలైనా కొంత వరకు చర్చించవచ్చు కానీ హద్దు దాటితే మన పనిపై శ్రద్ధ తగ్గుతుంది. గాసిప్స్ ఒక్కోసారి ఆనందంగా ఉంటాయి. ఒక్కోసారి బాధ కలిస్తాయి. అందరూ మంచి బుద్దితో ఆలోలించాలి’ అని రణబీర్ హితవు పలికారు.
ప్రేయసిపై రణ్బీర్ ప్రశంసలు
వర్క్ విషయంలో, నటన విషయంలో, చివరకు జీవితం విషయంలో.... అలియా చాలా నచ్చిందని రణవీర్ చెప్పారు. ఆమెతో అనుబంధం చాలా కొత్తగా ఉందంటూ..తన కొత్త ప్రేయసి గురించి రణబీర్ కపూర్ ఎంతో గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాడు.
మీరు చాలా రొమాంటిక్ పర్సన్ అని ప్రచారం జరుగుతుందని కదా అని ప్రశ్నించగా.. అలాంటి వాటిని పట్టించుకుంటే వృత్తిలో ఈ స్థాయికి రాణించలేకపోయేవాడినని పేర్కొన్నారు. ‘ ప్రజలు నన్ను నటుడిగానే ఇష్టపడాలని అనుకోవడంలేదు. వ్యక్తిగా కూడా ఇష్టపడాలని కోరుకుంటున్నా. అవును. నేను జీవితంలో కొన్ని తప్పులు చేశా అలాగే కొన్ని మంచి పనులు కూడా చేశా. కొన్ని సార్లు మన తప్పులే హైలెట్ అవుతాయి. బిజినెస్ భాగంగా అలా చేస్తారు.అంతే కానీ సోషల్ మీడియాలో వచ్చే పుకార్లకు నేను జవాబు ఇవ్వలేను’ అని రణబీర్ అన్నారు.
అలియాతో పెళ్లిఅయిన రూమర్లపై స్పందిస్తూ.. అవన్ని పుకార్లేనని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదనన్నారు. ‘ నాకు ప్రస్తుతం 35 ఏళ్లు. ఇది పెళ్లి చేసుకునే వయసే. అలియాతో ఉన్న రిలేషన్ను ఇంకో లెవల్కి తీసుకెళ్లాలను కుంటున్నా. కానీ ఎప్పుడు అనేది చెప్పలేను. ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచన లేదని చెప్పుకొచ్చాడు ఈ చాక్లెట్ భాయ్.
ప్రస్తుతం రణ్బీర్, అలియాలు కలిసి బ్రహ్మస్త్ర చిత్రంలో నటిస్తున్నారు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్పై రూపొందుతున్న చిత్రానికి యే జవానీ హై దివానీ చిత్ర దర్శకుడు ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే 2019 ఆగస్టు 15న రిలీజ్ కానున్నది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు