రంగస్థలం.. లవ్ స్టోరీ కాదట..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన టీజర్లు, సాంగ్ను బట్టి ఇది పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. అయితే సుకుమార్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చే ట్వీస్ట్ ను సినిమాలో చూపించబోతున్నాడట.
సినిమాలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కు ఇంపార్టెన్స్ ఉన్నా.. ప్రదానంగా రంగస్థలం సినిమా మర్డర్ మిస్టరీగా సాగనుందట. తన సోదరుడి మరణానికి కారణమైన వ్యక్తులను అంతం చేయటం కోసం వినికిడిలోపం ఉన్న హీరో ఏం చేశాడన్నదే సినిమాలో మెయిన్ పాయింట్ అంటున్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజమేంతో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని వార్తలు