ఫుల్ స్వింగ్
ఫుల్ స్వింగ్లో ఉన్నారు హీరో రామ్చరణ్. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్లో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ను ఫుల్ స్వింగ్లో కంప్లీట్ చేస్తున్నారు రామ్చరణ్. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. స్నేహ, ప్రశాంత్, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్గా బ్యాంకాక్లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసింది చిత్రబృందం.
ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్చరణ్ నటించిన బ్లాక్బాస్టర్ మూవీ ‘రంగస్థలం’ సినిమా 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఆ ఈవెంట్ను సెలబ్రేట్ చేసుకునేందుకు ‘రంగస్థలం’ దర్శకుడు సుకుమార్ చిత్ర హీరో రామ్ చరణ్ దగ్గరకు బ్యాంకాక్ వెళ్లారు. అక్కడే ఆ మెమొరిబుల్ ఈవెంట్ను సెలబ్రేట్ చేసుకున్నారు చరణ్, సుక్కు. శనివారం రాత్రి బ్యాంకాక్ నుండి హైదరాబాద్ చేరుకుంది బోయపాటి చిత్ర బృందం. జూన్ 12 నుంచి మరో మేజర్ షెడ్యూల్ను హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారట టీమ్. దర్శకుడు బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రిషీ పంజాబీ.