ఇక మక్కళ్‌ తలైవర్‌

Rajinikanth Is Now makkal thalaivar Said Fans - Sakshi

రజనీకి అభిమానుల బిరుదు

తమిళసినిమా: దేనికైనా హద్దులుంటాయేమోగానీ, అభిమానానికి హద్దులు ఉండవు. అవి ఉం టే అది అభిమానమే అయ్యి ఉండదు. ప్రపంచ స్థాయిలో అలాంటి వీరాభిమానులు కలిగిన నటుడు రజనీకాంత్‌. ఆయనకు ఇప్పటికే చిత్రపరిశ్రమ సూపర్‌స్టార్‌ బిరుదు ఇచ్చేసింది. అప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌నేనని ఇటీవల ఆయన అల్లుడు, నటుడు ధనుష్‌ బహిరంగంగానే పేర్కొన్నారు. రజనీకాంత్‌ ఇప్పుడు రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. అందు కు గ్రౌండ్‌వర్క్‌ వేగంగా జరుగుతోంది.

పార్టీ పేరును ప్రకటించడమే తరువాయి అన్న తరుణంలో రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన కాలా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. భారీ అంచనా ల మధ్య విడుదలైన కాలా చిత్రం మరి ఆ అంచనాలను రీచ్‌ అవుతోందా అన్న విషయాన్ని పక్కన పెడితే రజనీకాంత్‌ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. చిత్రానికి మరింత బూస్ట్‌ ఇచ్చే విధంగా ప్రచారం చేయడంలో ముమ్మరంగా ఉన్నారు. ప్రధాన నగరాల్లో కాలా చిత్ర పోస్టర్లు, కటౌట్ల్‌ ఏర్పాటు చేస్తున్నారు. రజనీకాంత్‌ రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్న సందర్భం లో విడుదలైన చిత్రం కావడంతో అభిమాన సం ఘాలు ప్రచురించే పోస్టర్లపై నల్వదై సెయ్‌వోమ్‌( మంచి చేస్తాం) అనే వచనాలు కచ్చితంగా చోటు చేసుకోవడం విశేషం. అదే విధంగా నిజాలను నొక్కి వక్కానించండి అని చెప్పిన మక్కళ్‌ తలైవర్‌ (ప్రజానాయకుడు), ప్రజాశక్తి అంటూ రజనీకాంత్‌కు పట్టం కడుతూ పోస్టర్లలో పొందుపరుస్తాన్నారు. ఇక తమ నాయకుడు రాజకీయ పార్టీని ఎప్పుడు వెల్లడిస్తారన్న ఆత్రుతతో రజనీకాంత్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

రజనీపై ఇళంగోవన్‌ విమర్శలు
 రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశం గురించి ప్రకటించినప్పటి నుంచి ఆయనపై రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు సందర్భం కలిగినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సీనీ దర్శకులు భారతీరాజా, అమీర్, సీమాన్‌ లాంటి వారు విమర్శల దాడి చేస్తున్నారు. అదే విధంగా రాజకీయ నాయకులు ఆరోపణలు, సెట్టైర్లు వేయ డం పరిపాటిగా మారింది. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌.ఇళంగోవన్‌ రజనీకాంత్‌ గురించి ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తూత్తుకుడి కాల్పుల సంఘటనను పదవీ బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తినే జలియన్‌ వాలాబాగ్‌ సంఘటనతో పోల్చి మాట్లాడగా కొత్తగా వచ్చి రాజకీయ నాయకుడినని చెప్పుకుంటున్న వ్యక్తి  ఆ పోరాటం లో సంఘవిద్రోహులు వచ్చి చేరారంటున్నారని రజనీకాంత్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయన నటించిన కాలా చిత్రం విడుదలైందని, మళ్లీ తదుపరి చిత్రం విడుదల సమయంలోనే ఆయన మాట్లాడతారని వ్యంగ్యంగా అన్నారు.

నటుడు వివేక్‌ చురకలు
 హస్యనటుడు వివేక్‌ కూడా రజనీకాంత్, కమలహాసన్‌ల రాజకీయరంగ ప్రవేశంపై చురకలు వేశారు.ఆయన ఒక భేటీలో పేర్కొంటూ రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చునని అన్నారు. ఆ విధంగా రజనీకాంత్, కమలహాసన్‌ ప్రేక్షకాదరణ కలిగిన వారు కాబట్టి రాజకీయ రంగప్రవేశాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. అయితే రాజకీయరంగ ప్రవేశం చేస్తే అందుకోసం 100 శాతం శ్రమించాలన్నారు. అంతే గానీ తాము సినిమాలోనూ నటిస్తాం, రాజకీయాల్లోనూ ఉంటామంటూ రెండు పడవల ప్రయాణం చేయకూడదన్నారు. వారు స్వప్రయోజనాలను పక్కన పెట్టి పూర్తిగా అంకితభావంతో ప్రజల కోసం పని చేయాలని నటుడు వివేక్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top