పానీ కోసం పోరాటం

Priyanka Chopra is open to great concepts - Sakshi

మహారాష్ట్రలోని వాటర్‌ ప్రాబ్లమ్స్‌పై కాన్సంట్రేట్‌ చేశారు బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా. ఆ నీటి సమస్యలను సిల్వర్‌ స్క్రీన్‌పై చూపించాలనుకుంటున్నారు. అవును... ప్రియాంకా ప్రొడక్షన్‌ హౌస్‌ çపర్పుల్‌  పెబ్లీ పిక్చర్స్‌లో నీటి సమస్యల ఆధారంగా ‘పానీ’ అనే మరాఠీ సినిమా రూపొందనుంది. మరాఠీ యాక్టర్‌ ఆదినాథ్‌ కొఠారే నటిస్తూ, దర్శకత్వం వహించనున్నారు. నటుడు, దర్శకుడు మహేశ్‌ కొఠారే తనయుడే ఆదినాథ్‌. మహారాష్ట్రలోని నగర్‌వాడి విలేజ్‌లో వాటర్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల చాలామందికి వివాహం కాదట.

అందులో ఒక వ్యక్తి జీవితం ఆధారంగానే ఈ సినిమా రూపొందనుందని బీటౌన్‌ టాక్‌. ‘‘మన చూట్టూ జరుగుతున్న ఇంట్రెస్టింగ్‌ కథలను తెరకెక్కించి, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసేందుకే ప్రొడక్షన్‌ హౌస్‌ను సార్ట్‌ చేశాం. కొత్తవాళ్లను కూడా ప్రోత్సహించినట్లు ఉంటుంది. ‘పానీ’ సినిమా కోసం ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారు ప్రియాంకా చోప్రా. ఈ సంగతి ఇలా ఉంచితే.. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందుతున్న ‘భరత్‌’ సినిమాలో నటిస్తున్నారు ప్రియాంకా చోప్రా. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top