దివాళి కానుక : పోస్టర్స్తో హంగామా!
దీపావళి పండుగతో అందరూ బిజీగా ఉన్నారు. అయితే తమ అభిమానులకు ఈ పండుగ ఇంకాస్త ఆనందంగా ఉండాలని హీరోలు తమ రాబోయే సినిమాల్లోంచి లుక్స్ను, పోస్టర్స్ను రిలీజ్ చేస్తున్నారు. మంగళ వారమే కొన్ని పోస్టర్స్ను రిలీజ్ చేసిన హీరోలు.. ఈరోజు మరికొన్ని పోస్టర్స్ను దీపావళి శుభాకాంక్షలను తెలియజేస్తూ రిలీజ్చేశారు.
అఖిల్ మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ నుంచి మరో కొత్త పోస్టర్ను రిలీజ్చేశారు. మాంచి మూడ్లో ఉండి స్టెప్పులేస్తున్న అఖిల్ ఈసారి అదరగొట్టేలా ఉన్నాడని అభిమానులు సంబరపడుతున్నారు. ఇక వరుణ్ తేజ్ నటిస్తున్న ‘అంతరిక్షం’, ‘ఎఫ్2’ చిత్రాలకు సంబంధించిన కొత్త పోస్టర్స్ను రిలీజ్ చేశారు. గీతాంజలితో సక్సెస్కొట్టిన అంజలి మళ్లీ హారర్ జోనర్లో నటిస్తున్న చిత్రం లీసా. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆపరేషన్ గోల్డ్ఫిష్’ చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇలా కొత్త పోస్టర్స్తో తమ అభిమానుల్లో జోష్ను నింపుతున్నారు.
సంబంధిత వార్తలు