అంతా సిద్ధం..!
యస్.. అంతా సిద్ధం చేస్తున్నారట. ఎందుకో? ఎవరి కోసమో తెలుసా? మహేశ్బాబు కోసం.‘బృందావనం’, ‘ఊపిరి’ వంటి చిత్రాలను అందించిన వంశీౖ పెడిపల్లి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం యూఎస్ బ్యాక్డ్రాప్లో సాగనుందని ఫిల్మ్నగర్ సమాచారం. ఇటీవలే డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమా లొకేషన్స్ కోసం యూఎస్ వెళ్లారు. అక్కడ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్తో కలిసి మ్యూజిక్ సెట్టింగ్స్ వేసిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ మూడు ట్యూన్స్ను ఫైనలైజ్ చేశారు. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్ను స్టార్ట్ చేయడానికి అంతా రెడీ చేస్తున్నారని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో రకుల్ను హీరోయిన్గా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ చేశారన్నది ఫిల్మ్నగర్ టాక్.
నాన్స్టాప్గా భరత్!
మహేశ్బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అలీ అద్వాని కథానాయిక. ఇందులో మహేశ్ సీయంగా నటిస్తున్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి ‘భరత్ అనే నేను’ టైటిల్ను పరిశీలిస్తున్నారని ఫిల్మ్నగర్ టాక్. అయితే హైదరాబాద్లోని ప్రముఖ స్టూడియోలో సీయం చాంబర్కి చెందిన సీన్స్ను చిత్రంబృందం నాన్స్టాప్గా గత నాలుగు రోజులు నుంచి తెరకెక్కిస్తున్నారు. అంటే సినిమాలో ఈ సీన్స్ ఎంతో కీలకౖమై ఉంటాయి. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళీ ప్రతిపక్షనేతగా నటిస్తున్నారట. సో... మహేశ్, పోసానిల మధ్య వచ్చే సీన్స్లో మాంచి కామెడీతో కూడిన పంచ్లు ఉంటాయని ఆశించవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.