ఇటలీలో యాభై ఏళ్ల క్రితం!

Pooja Hegde to romance Prabhas in Radha Krishna Kumar's next? - Sakshi

దాదాపు యాభై ఏళ్లు వెనక్కి వెళ్లనున్నారు దర్శకుడు రాధాకృష్ణ అండ్‌ కో. ఇది ఆయన తాజా కొత్త చిత్రం కోసమే. ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్‌ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ వర్క్‌ ఇటలీలోని మిలాన్‌లో ప్రారంభమైంది. ‘‘ఇటలీలో పని (సెట్‌ వర్క్‌) ప్రారంభించాం. సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు రాధాకృష్ణ. పీరియాడిక్‌ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌లో ముందు పూజా హెగ్డేపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఆ తర్వాత ప్రభాస్‌ సెట్‌లో జాయిన్‌ అవుతారని టాక్‌. ప్రస్తుతం సెట్‌ వర్క్‌ పనిలో బిజీగా ఉంది యూనిట్‌. ముఖ్యంగా 1970 కాలం నాటి లుక్‌ వచ్చేలా సెట్‌లో జాగ్రత్తలు పాటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top