బహుశా వాళ్లకి ప్రధానిని కలిసే అర్హత లేదేమో!

PM Modi Met Bollywood Delegation Netizens Fires On That Meeting - Sakshi

ముంబై : బాలీవుడ్‌ ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ముంబై రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ సాధించిన ప్రగతి, పలు అంశాల గురించి విస్తృతంగా చర్చించామని మోదీ పేర్కొన్నారు. బాలీవుడ్‌ నిర్మాతలు రితేష్‌ సిద్వానీ, కరణ్‌ జోహార్‌, సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌, రాకేష్‌ రోషన్‌, రోనీ స్క్రూవాలా, ప్రసూన్‌ జోషి తదితరులు ప్రధానిని కలిసిన బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా...‘ చిత్ర పరిశ్రమ ప్రముఖులతో జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. సినీ రంగంలో జీఎస్టీ అమలు విధివిధానాలపై వారి విలువైన సలహాలు ఇచ్చారు’ అంటూ సినీ ప్రముఖులతో దిగిన ఫొటోను మోదీ ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు.

కాగా ప్రధాని ట్వీట్‌పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ సినీ రంగంలో కావాల్సినంత మంది మహిళలు ఉన్నారు. కానీ ప్రధానిని కలిసిన బృందంలో ఒక్క మహిళ కూడా లేకపోవడం చాలా బాగుంది’ అంటూ ఓ మహిళ వ్యంగ్యంగా ట్వీట్‌ చేయగా... ‘భారత్‌లో మీటూ ఉద్యమం ప్రకంపనలు పుట్టించినప్పటికీ దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. సినీ రంగంలో ఉన్న మహిళలు ప్రధానిని కలవడానికి అర్హులు కారేమో’ అంటూ మరొకరు మండిపడ్డారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top