కలకత్తాలో కంప్లీట్‌

Padi Padi Leche Manasu Kolkata Schedule Completed - Sakshi

కలకత్తాలో ప్రేమ విహారం పూర్తి చేసుకున్న శర్వానంద్, సాయిపల్లవి నెక్ట్స్‌ నేపాల్‌ షిఫ్ట్‌ కానున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. కలకత్తాలో 70 రోజులు షూటింగ్‌ కంప్లీట్‌ చేసిన చిత్రబృందం నెక్ట్స్‌ షెడ్యూల్‌ను నేపాల్‌లో స్టార్ట్‌ చేయనుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ముఖ్య తారాగణంపై కలకత్తాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. డైరెక్టర్‌ హను మరో మంచి ప్రేమకథతో మీ ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సాయి పల్లవి జంట చూడముచ్చటగా ఉంటుంది. చంద్రశేఖర్‌ సంగీతం, జయకృష్ణన్‌ సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తాయి’’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top