రూ. 30 లక్షలు విరాళమిచ్చిన నారా రోహిత్‌

Nara Rohith Donates RS 30 Lakhs To Combat Coronavirus - Sakshi

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు పలువురు తెలుగు సినీ ప్రముఖుల తమ వంతు సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో నారా రోహిత్‌ కరోనాపై పోరాటం కోసం రూ. 30 లక్షల విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 10 లక్షల చొప్పున విరాళం అందజేయనున్నట్టు రోహిత్‌ తెలిపారు. మరో రూ. 10 లక్షలను ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రోహిత్‌ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అందరూ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. మనం పాటించే స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. అందరం సమిష్టిగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమికోడదామని పిలుపునిచ్చారు. 

సీసీసీకి రూ. 3లక్షలు విరాళమిచ్చిన సందీప్‌ కిషన్‌.. 
కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు ఆదుకునేందుకు మెగాస్టార్‌ చిరంజీవి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన సీసీసీ మనకోసం నిధికి హీరో సందీప్‌ కిషన్‌ రూ. 3లక్షలు విరాళమిచ్చారు. మరోవైపు తన వివాహ భోజనంబు రెస్టారెంట్లలో పనిచేస్తున్న 500 మందికి పైగా ఉద్యోగులకు సంబంధించిన బాధ్యతలను తీసుకుంటున్నట్టు చెప్పారు. మన పని మనం చేద్దాం, సురక్షితంగా ఉందామని పిలుపునిచ్చారు. (ప్రభాస్‌, బన్నీ మళ్లీ ఇచ్చారు!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top