పిప్రిలో హీరో నాగచైతన్య, సాయిపల్లవి సందడి

Naga Chaitanya And Sai Pallavi In Nizamabad - Sakshi

సాక్షి, పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలం పిప్రి గ్రామంలో హీరో అక్కినేని నాగార్జున తనయుడు, యువహీరో అక్కినేని నాగ చైతన్య, ఫిదా సినిమా ఫేం సాయిపల్లవి సోమవారం సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు శేఖర్‌క మ్ముల దర్శకత్వంలో గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా గడ్డం నడ్పి రాజన్న అనే రైతు ఇంట్లో కుంటుంబ కథ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నా రు. కాగా సుస్వాగతం సినిమాలో హీరోయిన్‌గా నటించిన దేవయాని, రాంబంటు సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ శ్వరిరావ్‌ హీరో, హీరోయిన్‌ల తల్లి పాత్రలను పోషిస్తున్నారు. కాగా షూటింగ్‌లో భాగంగా హీరో, హీరోయిన్‌ కుటుంబాల మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత ఫిబ్రవరిలో పిప్రిలో చిత్రీకరించిన సన్నివేశాల్లో మార్పులు జరగడం వల్ల సినిమాను రీ షూటింగ్‌ చేస్తున్నట్లు సమాచారం.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top