మహదేవపట్నంలో సినిమా షూటింగ్‌

Movie Shooting in Mahadevapatnam West Godavari - Sakshi

పశ్చిమగోదావరి ,ఉండి: శ్రీవెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆధ్వర్యంలో నూతన నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ బుధవారం ఉండి మండలం మహదేవపట్నంలో నిర్వహించారు. హీరో గోపీవర్మ, హీరోయిన్‌ ఆయేషాసింగ్‌లపై కొన్ని సీన్‌లు చిత్రీకరించారు. హీరో భీమవరం కుర్రాడు. ఈ సినిమా షూటింగ్‌ను కొద్ది రోజులు పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో చేశామని, ప్రస్తుతం భీమవరం పరిసరాల్లోనే చిత్రీకరణ చేస్తున్నట్లు హీరో తెలిపారు. భీమవరం పరిసరాల్లో చిత్రీకరణ జరగడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top