మహదేవపట్నంలో సినిమా షూటింగ్
పశ్చిమగోదావరి ,ఉండి: శ్రీవెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నూతన నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ బుధవారం ఉండి మండలం మహదేవపట్నంలో నిర్వహించారు. హీరో గోపీవర్మ, హీరోయిన్ ఆయేషాసింగ్లపై కొన్ని సీన్లు చిత్రీకరించారు. హీరో భీమవరం కుర్రాడు. ఈ సినిమా షూటింగ్ను కొద్ది రోజులు పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో చేశామని, ప్రస్తుతం భీమవరం పరిసరాల్లోనే చిత్రీకరణ చేస్తున్నట్లు హీరో తెలిపారు. భీమవరం పరిసరాల్లో చిత్రీకరణ జరగడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.