మెర్శల్కు చిక్కులు
తమిళసినిమా: మెర్శల్ చిత్ర టైటిల్ చిక్కుల్లో పడింది. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం మెర్శల్. నటి సమంత, కాజల్అగర్వాల్, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో తేనాండాళ్ ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. గురువారం చిత్ర టీచర్ విడుదలై విశేష ప్రేక్షకాదరణను పొందుతోంది.
చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే వెల్లడించారు. అందుకు సమాయత్తం అవుతున్న సమయంలో సడన్గా చిత్ర టైటిల్ మెర్శల్కు సమస్యలు తలెత్తాయి. విషయం ఏమిటంటే ఇంచుమించు ఇలాంటి టైటిల్ మెరసలయిటేన్ పేరుతో ఏఆర్.ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ అధినేత ఎ.రాజేంద్రన్ తమిళనాడు నిర్మాతల మండలిలో రిజిస్టర్ చేశారు. ఆయన ఇప్పుడు విజయ్ చిత్రానికి మెర్శల్ చిత్రాన్ని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ చెన్నై హైకోర్టును ఆశ్రయించారు.
ఎ.రాజేంద్రన్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దీనిపై రెండు వారాల్లో బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా తేనాండాళ్ ఫిలింస్ సంస్థ అధినేతకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దీంతో మెర్శల్ టైటిల్ ఇళయదళపతి చిత్రానికి దక్కేనా? అన్న సంశయం కోలీవుడ్లో నెలకొంది.
మరిన్ని వార్తలు